ఓటింగ్ సరళిని పరిశీలించిన టీపీసీసీ చీఫ్ రేవంత్

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో పోలింగ్ సరళిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు.

Update: 2023-11-30 09:01 GMT

దిశ, భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో పోలింగ్ సరళిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. అంతకు ముందు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పరిశీలించిన అరగంట తరువాత రేవంత్ రెడ్డి గ్రామానికి చేరుకొని ఓటింగ్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులు ఏమైనా మాట్లాడాలని అడగగా నో కామెంట్ అంటూ కామారెడ్డి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీమ్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ తదితరులు ఉన్నారు.


Similar News