బంగారం దుకాణంలో చోరీ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జెండా గల్లీలో గల బంగారం దుకాణంలో ఆదివారం చోరీ జరిగింది.
దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జెండా గల్లీలో గల బంగారం దుకాణంలో ఆదివారం చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బంగారం దుకాణంలోకి కొందరు బంగారం కావాలని వచ్చారు. యాజమానికి మాయమాటలు చెప్పి బంగారం చోరీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.