ఇంటి నుంచి వెళ్లిన మహిళ తిరిగి రాలేదు

అందరూ నిద్రిస్తున్న సమయంలో భర్త, పిల్లలను వదిలి ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Update: 2024-02-08 14:13 GMT

దిశ, కామారెడ్డి : అందరూ నిద్రిస్తున్న సమయంలో భర్త, పిల్లలను వదిలి ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆమె ఆడబిడ్డ జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని హరిజనవాడకు చెందిన తుమ్మల లావణ్య (30) అనే మహిళ బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భర్త, పిల్లలు నిద్రిస్తుండగా వారిని విడిచిపెట్టి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. లావణ్య కోసం చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. లావణ్య ఆచూకీ లభిస్తే తమను సంప్రదించాలని సీఐ కోరారు.


Similar News