కాంగ్రెస్ వైపే గాలి...కారు ఖాళీ

ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి బలం పుంజుకుంది.

Update: 2024-08-31 10:39 GMT

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి బలం పుంజుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఐదుగురు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎల్లారెడ్డి పురపాలక పట్టణంలో అభివృద్ధి తమ లక్ష్యంగా భావించిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే మదన్మోహన్ అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ నుగొండ భూదేవి శ్రీనివాస్, ఒకటవ వార్డ్ కౌన్సిలర్ అల్లం శ్రీనివాస్, పదవ వార్డ్ కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్, ఆరో వార్డ్ కౌన్సిలర్ సంఘాని బాలమని పోచయ్య, 12వ వార్డ్ కౌన్సిలర్ నీలకంఠం, బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

    అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఎల్లారెడ్డి మండలంలోని జంగమయ్యపల్లి మాజీ సర్పంచ్ రజిత వెంకటరామిరెడ్డి, తిమ్మారెడ్డి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 

Tags:    

Similar News