అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన వ్యక్తి మృతి..ఆ తర్వాత ఏమైందంటే..?

ప్రమాదవశాత్తు వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన పిట్లం మండలంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-21 12:03 GMT

దిశ, పిట్లం: ప్రమాదవశాత్తు వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన సంఘటన పిట్లం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..గౌరారం గ్రామానికి చెందిన మద్దెల సాయిలు (42) ఈనెల 19న తమ కులస్తుల అంతిమ కార్యక్రమంలో పాల్గొని స్నానం చేయడానికి చెరుకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. చెరువులో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి సోమవారం రోజు శవమై తెలాడన్నారు. గమనించిన స్థానికులు తల్లి పోచవ్వకు సమాచారం అందించారు. దీంతో తల్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తల్లి పోచవ్వ ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు.


Similar News