యువకుడిని ఢీ కొట్టిన లారీ

బోర్ లారీ ఢీ కొట్టడంతో అక్కడిక్కడే యువకుడు మృతి చెందాడు.

Update: 2024-01-08 13:13 GMT

దిశ, ఎల్లారెడ్డి: బోర్ లారీ ఢీ కొట్టడంతో అక్కడిక్కడే యువకుడు మృతి చెందాడు.  ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలోని జంగమయ్య పల్లి మత మాల ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మండలంలోని, జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన అక్కం బాలరాజు (19) జంగమయ్య పల్లి నుంచి ఎల్లారెడ్డి మండల కేంద్రంకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బోర్వెల్ వాహనం, మృతుడు బాలరాజు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టడంతో బైక్ పైన ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన బాలరాజు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. మృతుని కుటుంబీకుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎస్సై తెలిపారు.


Similar News