చెట్టుకు కంటైనర్ ఢీకొని డ్రైవర్ దుర్మరణం

సీసీ కెమెరాల లోడుతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో స్టీరింగ్ మధ్యలో ఇరుక్కొని డ్రైవర్ దుర్మరణం పాలైన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Update: 2024-02-09 14:09 GMT

దిశ, భిక్కనూరు : సీసీ కెమెరాల లోడుతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో స్టీరింగ్ మధ్యలో ఇరుక్కొని డ్రైవర్ దుర్మరణం పాలైన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆంధ్ర ప్రదేశ్ లోని కడప నుండి నోయిడాకు వెళ్తున్న కంటైనర్ లారీ మండల కేంద్రంలోని రామేశ్వర్ పల్లి బైపాస్ దాటి కొద్ది దూరం వెళ్లిన తర్వాత

    అదుపుతప్పి రోడ్డు కింద ఉన్న చెట్టు ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన అనిల్ కుమార్ బిందు(38) క్యాబిన్ ముందు భాగం దెబ్బతిని స్టీరింగ్ లో తల ఇరుక్కొని మృతి చెందాడు. మృతునికి భార్య అనిత ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ సాయికుమార్ నేతృత్వంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, స్టీరింగ్ లో ఇరుక్కున్న మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.


Similar News