ఇద్దరు వేటగాళ్ల పట్టివేత

నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు వేటగాళ్లను పట్టుకున్నట్లు అటవీ శాఖ రేంజ్ అధికారి బాబు తెలిపారు.

Update: 2024-01-11 14:30 GMT

దిశ, బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని అటవీ ప్రాంతంలో ఇద్దరు వేటగాళ్లను పట్టుకున్నట్లు అటవీ శాఖ రేంజ్ అధికారి బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్ని అటవీ ప్రాంతంలో కాకులకు ఆహారం చల్లుతూ ఇద్దరు వ్యక్తులు కనిపించడం జరిగిందని, వారిని చూసి అనుమానం రావడంతో వారి దగ్గరకు వెళ్లి పరిశీలించగా ఆ ఆహారంలో విష పదార్ధాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వారిపై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.  


Similar News