గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని పోచమ్మ వాగు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్య మైంది.

Update: 2024-10-03 12:49 GMT

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని పోచమ్మ వాగు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్య మైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వాగు వద్ద ఓ పురుషుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తి వయసు దాదాపు 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. అతని చేతి పైన ఉన్న పచ్చబొట్టు తమిళంలో ఉండగా.. తెలుగులో అనువదించగా వాసుమి అనే పేరుతో ఉందన్నారు. మృతుడు చనిపోయిన స్థలంకు కొద్ది దూరంలో ఎర్రటి టీషర్టు, ఒక జత చెప్పులు, ఒక గొడుగు, మందు సీసా ఉన్నాయన్నారు. మద్యం సేవించి చేపలు పట్టడానికి వెళ్లినట్లు కనపడుతుందని ఎస్ఐ తెలిపారు. ఎవరైనా మృతుని ఆనవాళ్లు గుర్తుపట్టినట్లయితే గాంధారి పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.


Similar News