ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ దాడి

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండంలోని మాదాపూర్ గ్రామ శివారులో అక్రమంగా ఎటువంటి అనుమతి లేకుండా ఇసుక రవాణా జరుగుతుండడంతో పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ సింగన్వార్ ఆదేశాల మేరకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు, సీఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.

Update: 2024-01-26 15:02 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండంలోని మాదాపూర్ గ్రామ శివారులో అక్రమంగా ఎటువంటి అనుమతి లేకుండా ఇసుక రవా ణా జరుగుతుండడంతో పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ సింగన్వార్ ఆదేశాల మేరకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు, సీఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక జేసీపీ, 4 టిప్పర్లు, 2 ట్రాక్టర్లను, ఇసుకను సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు సీపీ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుధాకర్, శంకర్, భూషణ్ పాల్గొన్నారు.


Similar News