పీడీఎస్ బియ్యం డంపులపై టాస్క్ ఫోర్స్ దాడి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాక్లుర్ మండలం పరిధిలోని రెండు చోట్ల పీడీఎస్ బియ్యం నిల్వ ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజా శేఖర్ రాజు, సీఐలు అంజయ్య ,అజయ్ బాబు సిబ్బంది ఆధ్వర్యంలో మెరుపు దాడి చేశారు.

Update: 2024-01-16 10:05 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాక్లుర్ మండలం పరిధిలోని రెండు చోట్ల పీడీఎస్ బియ్యం నిల్వ ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజా శేఖర్ రాజు, సీఐలు అంజయ్య ,అజయ్ బాబు సిబ్బంది ఆధ్వర్యంలో మెరుపు దాడి చేశారు. పీడీఎస్​ బియ్యాన్ని సేకరించి డంపు చేసిన ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక పనులు చేపడితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. పట్టుబడిన ముగ్గురిని, బియ్యాన్ని స్థానిక పోలీసులకు అప్పజెప్పారు.  


Similar News