కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లండి

కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ తీసు కెళ్లండని ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు అన్నారు.

Update: 2024-02-02 13:18 GMT

దిశ, ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ తీసు కెళ్లండని ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు అన్నారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో శుక్రవారం బీజేపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా

    ఆర్మూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ పాలెపు రాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకువెళ్లాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చొరవ తీసుకోవాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ ఆర్మూర్ మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మండల ఫోరం అధ్యక్షులు కేసీ ముత్తెన్న, బీజేపీ నాయకులు పండరి, హర్ష ,వినోద్, రవి తదితరులు పాల్గొన్నారు.


Similar News