గోవూర్లో ఒకరి అనుమానాస్పద మృతి

నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Update: 2024-02-03 11:08 GMT

దిశ, బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ శివారులో గల నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై గోవూర్ గ్రామ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి వాకింగ్ కు వెళ్తుండగా రోడ్డు పక్కన మృతదేహం పడి ఉన్నది చూసి వెంటనే పోలీస్ లకు తెలపడంతో ఘటన స్థలానికి పోలీసులు విచ్చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బోధన్ ఏరియా అస్పత్రికి తరలించారు.


Similar News