Suspend : ఉపాధ్యాయురాలు సస్పెన్షన్..

సిరికొండ మండలం కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పద్మజను సస్పెండ్ చేస్తూ డీఈవో దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-08-05 17:19 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సిరికొండ మండలం కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పద్మజను సస్పెండ్ చేస్తూ డీఈవో దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాద్యాయుల బదిలీల్లో భాగంగా పద్మజను సిరికొండ మండలం కొండూరుకు బదిలీ చేశారు. మోడిఫికేషన్ పేరుతో అదే మండలం కొండాపూర్ స్కూల్ కు అధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాద్యాయురాలు పద్మజ కొండూరు స్కూల్ నుంచి రిలీవ్ కాలేదు.

పైపెచ్చు తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఉపాధ్యాయ సంఘాలను ఆశ్రయించింది. మరో పక్క పోస్టింగ్ లో ఎలాంటి పొరపాటు జరగలేదని డీఈవో దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. కొండాపూర్ స్కూల్ లో డ్యూటీ జాయిన్ కావాలని కరాఖండిగా చెప్పారు. ఈ అంశం రాష్ట్ర ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో విచారణ కూడా కొనసాగుతోంది. ఈ దశలో పద్మజను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.

Tags:    

Similar News