ఏఆర్ ఎస్ఐ దేవి సింగ్ సస్పెన్షన్
నిజామాబాద్ ఏఆర్ ఎస్సై దేవి సింగ్ ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఏఆర్ ఎస్సై దేవి సింగ్ ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది అక్టోబర్ లో నమోదైన ఒక కేసుకు సంబంధించిన వివాదంలో ఎస్సైని బాధ్యుడిగా చేస్తూ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
దేవి సింగ్ తనయుడు ఇతరులతో జరిగిన గొడవకు సంబంధించి దేవి సింగ్ పరిధిని దాటి వివాదంలో తల దూర్చడంతో సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అని తెలిసింది. గత ఏడాది దేవి సింగ్ తనయుడు నగరంలోని ఒకటో టౌన్ పరిధిలో పోలీస్ సైరన్ కలిగిన సొంత వాహనంతో యువకులను ఢీ కొట్టి వారిపై దాడి చేసిన వివాదం పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఉన్నాయి.