ఏఎంసీ కార్యదర్శి సస్పెన్షన్
నిజామాబాద్ జిల్లా వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలో భారీ బాగోతమే నడిచింది.
దిశ, బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలో భారీ బాగోతమే నడిచింది. రైస్ మిల్లర్లు గోదాంలలో వరిధాన్యం నిల్వ ఉం చుకొని ఏఎంసీకి డబ్బులు చెల్లించక పోవడం పెద్ద దుమారమే లేపింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న కార్యదర్శి అవేమీ పట్టించుకోకుండా కమిషన్ లకు కక్కుర్తి పడ్డాడో ఏమో నిలువునా దొరికిపోయాడు. దీంతో ఆయన అవినీతికి పాల్పడ్డాడని, అదేవిధంగా విధులకు సారిగా హాజరు కాలేదని తేలడంతో కార్యదర్శి శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి గంగు తెలిపారు.