ఆరోగ్యానికి సూర్య నమస్కారాలు దోహదం

రథ సప్తమి సందర్భంగా జిల్లా యోగా భవనంలో 108 సూర్య నమస్కార కార్యక్రమం నిర్వహించారు.

Update: 2024-02-16 09:55 GMT

దిశ, కామారెడ్డి : రథ సప్తమి సందర్భంగా జిల్లా యోగా భవనంలో 108 సూర్య నమస్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 70 మంది యోగా సభ్యులు పాల్గొన్నారని యోగా గురువు రామ్ రెడ్డి తెలిపారు. సూర్య నమస్కారాల వలన మనసుకి, శరీరానికి చాలా మంచిదని తెలిపారు. యోగా ప్రక్రియలో సూర్యోభాసన, సూర్య నమస్కారాలు అతి ముఖ్యమన్నారు.

    రోజూ కనీసం 12 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం చేసినట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. మహిళలు పాల్గొని 108 సూర్య నమస్కారాలు పూర్తి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెట్టి గాడి అంజయ్య, రఘు కుమార్, సిద్ధ గౌడ్, సురేష్, రమేష్ కుమార్, పాత అశోక్, కర్ణశ్రీ పాల్గొన్నారు. 


Similar News