మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సబ్ కోర్ట్ జడ్జి నసీం సుల్తానా

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను శనివారం ఆర్మూర్ సబ్ డివిజన్ కోర్టు జడ్జ్ నసీం సుల్తానా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2023-12-02 12:43 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను శనివారం ఆర్మూర్ సబ్ డివిజన్ కోర్టు జడ్జ్ నసీం సుల్తానా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు రికార్డులను ఆమె పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జడ్జి సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని ఆదేశించారు. కోడిగుడ్డు, పప్పు దిన్సులు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి అన్నారు. విద్యార్థులకు

    నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వహణపై పర్యవేక్షణ చేస్తూ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో పాటు భోజనం చేయాలన్నారు. మధ్యాహ్న భోజన బిల్లులు సక్రమంగా రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ నిర్వాహకులు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలల్లోని డిజిటల్ తరగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రాజా గంగారం, లీగల్ కోర్ట్ కౌన్సిలర్ రాజేశ్వర్, సుఖేష్ , వసంత్ , రాజేశ్వర్ గంగాధర్ , మధుసూదన్ రెడ్డి, కోర్టు సిబ్బంది ప్రవీణ్ , ప్రవీణ్ కుమార్ , ఇంతియాజ్ అలీ, పాఠశాల హెచ్ఎం లక్ష్మీ నరసయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 


Similar News