బలవంతంగా విద్యాసంస్థలను మూసివేస్తే కఠిన చర్యలు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బుధవారం పాఠశాలల, కళాశాలల బంద్ కాల్ పై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సంచలన ప్రకటన చేశారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బుధవారం పాఠశాలల, కళాశాలల బంద్ కాల్ పై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సంచలన ప్రకటన చేశారు. విద్యాసంస్థలను ఎవరైనా బలవంతంగా మూయించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన జారీ చేశారు. స్కూల్, కాలేజ్ యాజమాన్యం వాళ్లంతట వాళ్లే మూసి వేస్తే పర్వాలేదు కానీ.. ఎవరైనా బలవంతంగా మూసి వేయించాలని చూస్తే వాటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.