ఎల్లారెడ్డి కి ‘శ్రీమంతుడు’ వచ్చారు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ గెలుపొందారు.

Update: 2023-12-03 10:58 GMT

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ గెలుపొందారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లోకల్, నాన్ లోకల్ అంటూ దుష్ప్రచారం చేశారు. 21 రౌండ్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మదన్మోహన్ 24,334 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. భారాస పార్టీ అభ్యర్థి జజాల సురేందర్ పై ఈయన గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకల్, నాన్ లోకల్ అంటూ ఎద్దేవా చేసి విమర్శించినప్పటికీ ప్రజలు మదన్మోహన్ చేసిన సేవలకు కృతజ్ఞులై గెలిపించారు. కరోనా కష్టకాలంలో ఎంతోమంది ప్రజలకు ఎనలేని సేవలందించారని గుర్తు చేసుకున్నారు. మదన్మోహన్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికి పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు.  


Similar News