రాష్ట్రస్థాయి పోటీలకు బడా భీంగల్ విద్యార్థుల ఎంపిక

Update: 2024-08-29 08:00 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ః సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ సబ్ జూనియర్ పోటీలకు భీంగల్ మండలం బడా భీంగల్ క్రీడాకారులు ఎంపికయ్యారు. గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినీ, విద్యార్థులు హర్షిణి, ప్రగతి, ఆనంధిత, ఉస్మాన్, అభినయ్ లు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ భూపతి తెలిపారు. కొన్నేళ్లుగా రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగే వివిధ క్రీడల్లో పాఠశాలలు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొంటున్నారు. పాఠశాలలో చదివే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను గుర్తించి వారిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాల్గొనే విధంగా స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ అన్ని రకాలుగా సహకారం అందిస్తూ, టోర్నమెంట్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సాయం కూడా చేస్తోంది. గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామస్తులు సహకారం, అధ్యాపకుల ప్రోత్సాహంతో పాఠశాల విద్యార్థులు క్రీడల్లో అచ్యుత ప్రతిభను కనబరుస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణ స్వామి అన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడలకు ఎంపికైన పాఠశాల విద్యార్థిని విద్యార్థులను అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్ గౌడ్ గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు సాలిపురం బాలరాజు, మహేష్, సాయిబాబాలు అభినందించారు.


Similar News