కూతురు పెళ్లికి దాచిన రూ.3లక్షలు, 32 తులాల బంగారం చోరీ..

Update: 2024-08-24 09:14 GMT

దిశ, వేల్పూర్ః అక్లూరు గ్రామంలో గురువారం సాయంత్రం ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే ముక్క ఆనంద్, నిర్మల భార్యభర్తలు. ఇద్దరూ కిరాణా కొట్టు నడుపుకుంటున్నారు. గురువారం సాయంత్రం భర్త ఆనంద్ కిరాణం సరుకులు తేవడానికి పొరుగూరికి వెళ్లారు. భార్య నిర్మల ఇంటికి తాళం వేసి పక్క వీధిలో ఉన్న తమ షాప్ కి వెళ్లారు. ఆ సమయంలోనే దొంగలు రెచ్చిపోయారు. భర్త తిరిగి వచ్చాక నిర్మల తిరిగి సాయంత్రం 7 గంటలకి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగల గొట్టి వుంది. బెడ్ రూమ్ తాళాలు కూడా పగల గొట్టి, బెడ్ రూంలో ఉన్న 32 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే 3 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లిపోయారని వాపోయారు. కూతురు పెళ్లి కని పైసా.. పైసా పోగు చేసి కూడబెట్టిన డబ్బులని.. అవి ఎత్తెకెళ్లారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News