బీజేపీ గూటికి రామకృష్ణ

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు పశ్చిమముల రామకృష్ణ ఆదివారం బీజేపీలో చేరారు.

Update: 2024-03-24 11:42 GMT

దిశ, లింగంపేట్ : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు పశ్చిమముల రామకృష్ణ ఆదివారం బీజేపీలో చేరారు. హైదారాబాద్ లోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో భాజాపా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ లో చేరారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. గత పదేళ్లుగా ఎంపీ బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. 


Similar News