డీఎస్ మృతి పట్ల రాహుల్ గాంధీ సంతాపం..

రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేత రాహుల్ గాంధీ తన సంతాపాన్ని తెలియజేశారు.

Update: 2024-07-04 17:39 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేత రాహుల్ గాంధీ తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు లేఖ రాశారు. ధర్మపురి శ్రీనివాస్ రాజకీయాల్లో నిబద్దత కలిగిన నాయకుడని, ఆయన రాజకీయ జవితం ఆదర్శప్రాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త మొదలుకుని ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజల మనిషిగా ధర్మపురి శ్రీనివాస్ చరిత్రలో డీఎస్ ఆకస్మిక మరణం పట్ల ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


Similar News