బయోమెట్రిక్ కోసం క్యూ

సబ్సిడీ గ్యాస్ వినియోగం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గ్యాస్ వినియోదారులకు ప్రభుత్వం బయోమెట్రిక్ ను అమలు చేయనుంది.

Update: 2023-12-07 13:08 GMT

దిశ, భిక్కనూరు : సబ్సిడీ గ్యాస్ వినియోగం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గ్యాస్ వినియోదారులకు ప్రభుత్వం బయోమెట్రిక్ ను అమలు చేయ నుంది. ఆ ప్రక్రియ పూర్తి చేయించుకునేందుకు మహిళలు భారీ క్యూ కడుతున్నారు. వేకువజామునే భిక్కనూరు, దోమకొండ మండలాల్లో ఉన్న గ్యాస్ కార్యాలయాల వద్ద కు చేరుకొని బయోమెట్రిక్ చేయించుకొని వెళ్తున్నారు. అయితే ఈ నెల 31వ తేదీ నమోదుకు ఆఖరి తేదీ కావడంతో గ్యాస్ కార్యాలయాలు ఓపెన్ కాకముందే గ్యాస్ బుక్కులను వెంటబెట్టుకొని వచ్చి క్యూలో నిలబడుతున్నారు. వేలిముద్ర నమోదు ప్రక్రియ పూర్తికాగానే వినియోగదారుడి పేరు, పాస్ బుక్ లో ఉన్న పేరు తో మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని వినియోగదారులను పంపివేస్తున్నారు.  

Similar News