భూమి విషయంలో తగాదా.. ఒకరి పై 9 మంది దౌర్జన్యం

నందిపేట మండల కేంద్రంలో గల తల్వద గ్రామంలో శనివారం ఉదయం పంట పొలాల్లోకి వెళ్లే రోడ్డు మార్గం విషయంలో కస్పా పెద్దన్న అనే రైతు పై 9 మంది కురుమ కులస్తులు దాడి చేశారు.

Update: 2024-07-07 10:30 GMT

దిశ, నందిపేట్ : నందిపేట మండల కేంద్రంలో గల తల్వద గ్రామంలో శనివారం ఉదయం పంట పొలాల్లోకి వెళ్లే రోడ్డు మార్గం విషయంలో కస్పా పెద్దన్న అనే రైతు పై 9 మంది కురుమ కులస్తులు దాడి చేశారు. ఈ ఘటనలో కస్ప పెద్దన్న తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరారు. బాధితుని వెన్నుముకకు తీవ్రగాయం కావడంతో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కస్పా పెద్దన్న కుమారుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలియజేశారు. వీరి అభ్యర్థన మేరకు ఎస్సై రాహుల్ స్పందించి తొమ్మిది మంది పై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.


Similar News