కోటగిరిలో పోలీసుల లాఠీ ఛార్జ్

ఎన్నికల వేళ కోటగిరి మండల కేంద్రంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

Update: 2023-11-24 15:37 GMT

దిశ, కోటగిరి : ఎన్నికల వేళ కోటగిరి మండల కేంద్రంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఒక ప్రధాన పార్టీ కి చెందిన మైనారిటీకి సంబంధించిన యువకులు మధ్యాహ్నం మసీద్ వద్ద నమాజ్ అనంతరం రెండు వర్గాలుగా ఏర్పడి దాడులు చేసుకున్నారు. తమపై కావాలనే ఒక వర్గ వారు దాడులకు పాల్పడుతున్నారని మరో వర్గానికి చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రాత్రి 7 గంటలకు ఇరువర్గాలకు సంబంధించిన వారు పోలీసు స్టేషన్ కు కూత వేట దూరంలో హై స్కూల్ వద్ద మళ్లీ పరస్పరదాడులు చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమైన అక్కడికి చేరుకొని పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. సీఐ జెయాష్ రెడ్డి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్నికల వేళ అవాంఛనీయ సంఘటనకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. 


Similar News