దేవునిపల్లిలో పీడీఎఫ్ బియ్యం పట్టివేత

కామారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలోని దేవనపల్లి గ్రామంలో పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు.

Update: 2024-03-12 15:53 GMT

దిశ, కామారెడ్డి క్రైమ్ : కామారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలోని దేవనపల్లి గ్రామంలో పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ తిరుపతయ్య తెలిపిన వివరాల ప్రకారం దేవునిపల్లి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద గౌరిశెట్టి సురేష్ ఇంట్లో సుమారు 12 క్వింటాల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచారనే సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి పట్టుకొని దేవునిపల్లి పోలీస్ వారికి అప్పగించినట్టు తెలిపారు. సురేష్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.  


Similar News