పార్లమెంట్ ఎన్నికల ఖర్చు ఏరోజు కారోజు లెక్కలు సమర్పించాలి

పార్లమెంటు ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుండి ఏ రోజు కారోజు లెక్కలు సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2024-03-13 10:28 GMT

దిశ ,మద్నూర్ : పార్లమెంటు ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుండి ఏ రోజు కారోజు లెక్కలు సమర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులతో మాట్లాడుతూ

    ఎన్నికల నియమ నిబంధనలను అందరూ సజావుగా పాటించాలప్నారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులతో మాట్లాడుతూ ఎన్నికల నిబంధన దాటకుండా ఖర్చుల విషయంలో లెక్కలు సమర్పించాలని, లేక పోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మద్నూర్ మండల తహసీల్దార్ ముజీబ్, రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, ఇతర పార్టీలకు చెందిన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. 


Similar News