ఒకరు ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంటే మరొకరు అవినీతి కొండగా మారారు

బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పేరు చెప్పి ఒకరు అవినీతి కొండగా మారితే మరొకరు ఊసరవెల్లి వలె పార్టీలు మారుస్తున్నాడని బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు.

Update: 2023-11-22 15:40 GMT

దిశ, ఆర్మూర్ : బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పేరు చెప్పి ఒకరు అవినీతి కొండగా మారితే మరొకరు ఊసరవెల్లి వలె పార్టీలు మారుస్తున్నాడని బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఊసరవెల్లి రంగులు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారని విమర్శించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

    బట్టాపూర్ క్వారీలో సుమారు 250 కోట్లు అక్రమంగా సంపాదించాడన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి పెద్ద అవినీతిపరుడని విమర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, అతని సోదరుడు నియోజకవర్గంలోని యువతను గంజాయికి బానిసలుగా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిస్తే పార్టీ మారమని గ్యారంటీ ఇస్తారా అని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్న గారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, మండల అధ్యక్షులు అంబటి నవీన్, నర్సయ్య, తోట చిన్నయ్య, శ్రీకాంత్, రాకేష్ బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News