పంటల మద్దతు ధరకు ఎంఎస్పీచట్టాన్ని తీసుకురావాలి

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సీపీఐ (ఎంఎల్​) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2024-02-16 09:29 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సీపీఐ (ఎంఎల్​) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్త గ్రామీణ భారత్ బంద్​లో పిలుపులో భాగంగా నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక దేశవ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కావున రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పార్లమెంట్ లో ఎంఎస్పీ చట్టాన్ని తీసుకురావాలని, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి

     తీసుకోవాలని, ఢిల్లీలో రైతులపై భాష్ప వాయువులు ఉపయోగించడం సరైనది కాదని, ఢిల్లీ రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమంలో రైతులపై మోపిన కేసులను ఎత్తివేయాలని, బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను మానుకోవాలని, ఆటో డ్రైవర్ల ను నూతనంగా తీసుకొచ్చే ఆర్టీసీ బస్సులలో 30 శాతం నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టీ సాయిరెడ్డి , జిల్లా సహాయ కార్యదర్శి దేవస్వామి, కృష్ణాగౌడ్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్ , పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ , ప్రజాసంఘాల నాయకులు నగేష్, రవీందర్, మణికంఠ, ఆటో కార్మికులు కలిం, జవ్విడ్, సాయన్న , రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. 


Similar News