ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే రాజకీయంలో వచ్చా.. ఎమ్మెల్యే

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజలు సమస్యల వినతులను జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్వీకరించారు.

Update: 2024-09-25 10:16 GMT

దిశ, జుక్కల్ : జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజలు సమస్యల వినతులను జూకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్వీకరించారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు రాజకీయంలో వచ్చానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలను వింటూ ఎమ్మెల్యే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు . నియోజకవర్గ అభివృద్ధి నిర్విరామంగా కృషి చేస్తుండటం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి వస్తే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. నియోజవర్గం అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Similar News