మంత్రి ప్రశాంత్ రెడ్డికి దమ్ముంటే కర్ణాటక సందర్శనకు రావాలి

కర్ణాటకలో పథకాలు అమలు కావడం లేదని ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే వేల్పూరు చౌరస్తాలొ చర్చకు వచ్చి కర్ణాటక రాష్ట్ర సందర్శనకు రావాలని కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సవాల్ చేశారు.

Update: 2023-11-21 15:43 GMT

దిశ, ఆర్మూర్ : కర్ణాటకలో పథకాలు అమలు కావడం లేదని ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే వేల్పూరు చౌరస్తాలొ చర్చకు వచ్చి కర్ణాటక రాష్ట్ర సందర్శనకు రావాలని కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సవాల్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో గల ప్రజానిలయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్కొండ నియోజక వర్గంలో దోపిడీ చేసి కోట్ల రూపాయలు సంపాదించిన ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం అన్నారు. బుధవారం మధ్యాహ్నం 12:00 గంటలకు వేల్పూరు చౌరస్తాలో తాను కూర్చుంటానని,

    ప్రశాంత్ రెడ్డి అక్కడకు రావాలని సవాల్ చేశారు. ప్రశాంత్ రెడ్డి కర్ణాటక వస్తానంటే విమానంలో భద్రంగా తీసుకెళ్లి అక్కడ అమలవు తున్న పథకాలను చూపిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన పనుల మీద ఓట్లు అడిగే దమ్ము లేక, పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 70 స్థానాలకు పైగా బంపర్ మెజారిటీతో గెలుస్తామన్నారు. తెలంగాణలో వీస్తున్న కాంగ్రెస్ గాలితో పాటు బాల్కొండలో సునీల్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన్ని బంపర్ మెజారిటీతో గెలిపిస్తాయన్నారు. విలేకరుల సమావేశంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News