ట్రేడ్ లైసెన్స్, నీటి పన్ను పై మేయర్​ సమీక్ష

నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మేయర్ దండు నీతు కిరణ్ కమిషనర్ తో కలిసి ట్రేడ్ లైసెన్స్, నీటి పన్ను పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Update: 2024-02-03 11:55 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మేయర్ దండు నీతు కిరణ్ కమిషనర్ తో కలిసి ట్రేడ్ లైసెన్స్, నీటి పన్ను పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ అధికారులతో మాట్లాడుతూ మున్సిపాలిటీకి రావలసిన బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని, సుధీర్ఘకాలంగా పెండింగ్ లో ట్రేడ్ లైసెన్స్, యూసర్ చార్జెస్, నీటి పన్ను వసూలుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ప్రజా అవసరాలను తీర్చటానికి మెరుగైన

    సదుపాయాలు కలిపించటానికి చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రజలు నిర్ణీత గడువులోగా ట్రేడ్ లైసెన్స్, యూసర్ చార్జెస్, నీటి పనులను చెల్లించి మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్, అకౌంట్ ఆఫీసర్ సుధాకర్, మున్సిపల్ ఇంజనీర్ మురళి మనోహర్, సెక్రెటరీ శ్రీపాద రామేశ్వరం, మేనేజర్ జనార్దన్, ఎంహెచ్ఓ సాజిద్ అలీ, టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Similar News