వివాహిత అదృశ్యం

లింగంపేట మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన ఎర్ర అర్చన అనే వివాహిత అదృశ్యమైనట్లు ఏఎస్ ఐ ప్రకాష్ తెలిపారు.

Update: 2024-01-26 14:52 GMT

దిశ, లింగంపేట్ : లింగంపేట మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన ఎర్ర అర్చన అనే వివాహిత అదృశ్యమైనట్లు ఏఎస్ ఐ ప్రకాష్ తెలిపారు. అర్చన శుక్రవారం భర్త సాయితో గొడవ పడ్డట్లు తెలిపారు. భార్యతో గొడవపడ్డ సాయిలు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో భార్య అర్చన కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించినట్లు ఆయన తెలిపారు. అర్చన ఆచూకీ లభించకపోవడంతో భర్త సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఏఎస్ఐ ప్రకాష్ తెలిపారు. అర్చన ఆచూకీ తెలిసినవారు లింగంపేట పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.


Similar News