గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

నగరానికి చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకువచ్చి ప్యాకెట్లలో విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి 1250 గ్రాముల గంజాయి, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.

Update: 2024-01-12 14:47 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నగరానికి చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకువచ్చి ప్యాకెట్లలో విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి 1250 గ్రాముల గంజాయి, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. నగర సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం ఖలీల్ వాడికి చెందిన సయ్యద్ సాజిద్ అలీ చంద్రశేఖర్ కాలనీ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నారని నమ్మకమైన సమాచారం మేరకు పట్టణ సీఐ , మూడవ పట్టణ ఎస్ఐ ప్రవీణ్ వారి సిబ్బంది నిందితుడిని

    అదుపులో తీసుకొని 1250 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేశారు. సాజిద్ అలీ మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన అనీస్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి నిజామాబాద్​లోని యువతకు, కొంతమంది వ్యక్తులకు రూ.200 కు ఒక ప్యాకెట్ చొప్పున అమ్మి జల్సా లకు పాల్పడుతున్నాడు. సయ్యద్ సాజిద్ ను అదుపులో తీసుకొని అతని వద్ద 1250 గ్రాముల గంజాయిని, 10 వేల రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. 


Similar News