వైన్స్ షాపుల ఎదుటబారులు తీరిన మందుబాబులు

ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులపాటు వైన్స్, బార్లను మూసేస్తూ ఆబ్కారీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-11-28 11:24 GMT

దిశ, జక్రాన్‌పల్లి: ఎన్నికల నేపథ్యంలో మూడు రోజులపాటు వైన్స్, బార్లను మూసేస్తూ ఆబ్కారీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారిచేసింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం నుంచి 30 తారీకు వరకు వైన్ షాపులు బందు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళ, బుధ, గురువారాలు మద్యం దుకాణాలు బంద్ ఉంటుండటంతో మందు ప్రియులు భారీగా వైన్స్ ఎదుట క్యూ కట్టారు. మంగళవారం సాయంత్రం జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ఉన్న మూడు వైన్ షాపుల వద్ద మద్యం ప్రియులు బారులు తీరారు. ఒకరిపై మరొకరు ఎగబడి మరీ మద్యం బాటిళ్లను కొనుగోలు చేశారు. 


Similar News