కుల బహిష్కరణ పై న్యాయ పోరాటం...

తమను అకారణంగా కుల బహిష్కరణ చేశారాని కోటగిరి మండల కేంద్రంలోని దళితవాడకు చెందిన సాయమ్మ ఆమె కూతురు స్వాతి చంటి బిడ్డతో న్యాయం కోసం అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు.

Update: 2024-02-19 12:22 GMT

దిశ, కోటగిరి: తమను అకారణంగా కుల బహిష్కరణ చేశారాని కోటగిరి మండల కేంద్రంలోని దళితవాడకు చెందిన సాయమ్మ ఆమె కూతురు స్వాతి చంటి బిడ్డతో న్యాయం కోసం అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... మాల కులానికి చెందిన తాము ఎలాంటి తప్పు చేయకుండనే కావాలనే కొందరు కుల బహిష్కరణ చేశారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కుల బహిష్కరణ పై పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేశామని తమకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.


Similar News