ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్ పోస్ట్ సేవలు ప్రారంభం
చాలా కాలంగా నిరూపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్ పోస్ట్కు అవసరమైన మరమ్మతులు చేసి రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తిరిగి ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు.
దిశ, కామారెడ్డి: చాలా కాలంగా నిరూపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్ పోస్ట్కు అవసరమైన మరమ్మతులు చేసి రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తిరిగి ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. 2013లో ఎన్హెచ్-44 అధికారుల అనుమతితో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈ ఇంటిగ్రేటెడ్ పోలీస్ చెక్ పోస్ట్ను టేక్రియాల్ X రోడ్ వద్ద ప్రారంభించి కొద్దిరోజులు సేవలు కూడా అందించినట్లు తెలిపారు. తర్వాత మరమ్మత్తుల వల్ల చాలా కాలంగా నిరుపయోగంగా ఉందన్నారు. ప్రస్తుతం దానికి మరమ్మతులు నిర్వహించి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో కామారెడ్డి రూరల్ సీఐ ఉంటూ పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అంతేగాకుండా ఎన్హెచ్ - 44 పోలీసు పెట్రోల్ వాహనం అధికారులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండి జిల్లా పరిధిలో ఎన్హెచ్-44 రహదారి పై ప్రమాదాల నివారణకు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐపీఎస్ అధికారిణి కాజల్ సింగ్, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు ప్రకాష్, శ్రీనివాస్, మధన్ లాల్, ఎస్పీ ఇన్స్పెక్టర్ జార్జ్, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.