16న కామారెడ్డి లో జాబ్ మేళా
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 16న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు మంగళవారం తెలిపారు.
దిశ, కామారెడ్డి : ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 16న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు మంగళవారం తెలిపారు. హైదరాబాద్, కామారెడ్డి లో పని చేసేందుకు అపోలో ఫార్మసీ కంపెనీ వారు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారని అన్నారు. అభ్యర్థులు 18 నుండి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి పదవ తరగతి,
ఇంటర్,డిగ్రీ, ఫార్మసీ కలిగి ఉండాలని, ఎంపికైన అభ్యర్థులకు నెలకు 11 నుండి 25 వేల జీతంతో పాటు ప్రోత్సాహకం కూడా ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 16న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ లోని 121వ గదిలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జరుగు ఇంటర్వ్యూ కు బయోడేటా, ఆధార్ కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫొటో, విద్యార్హత మొదలగు ధ్రువపత్రాలతో హాజరు కావాలని ఆయన సూచించారు.