జన్ ఔషధిని ప్రజలు వినియోగించుకోవాలి

ప్రధాన మంత్రి జన ఔషది కేంద్రంను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

Update: 2024-02-14 09:28 GMT

దిశ, బాల్కొండ : ప్రధాన మంత్రి జన ఔషది కేంద్రంను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రం మెండోరలో జన ఔషధి కేంద్రంను డి.అరవింద్ బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దేశంలో బ్రాండెడ్ మందులు, సర్జికల్ ఉపాకరణాలు అధిక ధరల కారణంగా

    ప్రాథమికంగా గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు పొందడం సవాలుగా మారిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జన ఔషధి కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొమ్ములు రమేష్, సతీష్, గోపిడి చిన్న, కొడార్ముర్ నిఖిల్, రాజారెడ్డి, యావతి సూరజ్ పాల్గొన్నారు. 


Similar News