MLA : చారిత్రాత్మకమైన ప్రగతిశీల బడ్జెట్

అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన తెలంగాణ రాష్ట్ర 2024-2025 వార్షిక బడ్జెట్ ఎంతో చారిత్రాత్మకమైనదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.

Update: 2024-07-25 16:12 GMT

దిశ, జుక్కల్ :- అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన తెలంగాణ రాష్ట్ర 2024-2025 వార్షిక బడ్జెట్ ఎంతో చారిత్రాత్మకమైనదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ప్రతీ ఒక్క రంగానికి ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చేయడం జరిగిందని, అన్ని వర్గాలకు సమతుల్యమైన, ఆమోదయోగ్యమైన బడ్జెట్ అంటూ హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి, విద్యా రంగానికి, నీటి పారుదల రంగానికి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి పెద్ద పీట వేయడం శుభపరిణామం అని అన్నారు.


Similar News