రైతులు తొందరపడి తక్కువ ధరలకు పంటల దిగుబడులు అమ్ముకోవద్దు.. మార గంగారెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మొక్కజొన్న, సోయా కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి సోమవారం తెలిపారు.

Update: 2024-09-16 12:46 GMT

దిశ, ఆర్మూర్ : రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మొక్కజొన్న, సోయా కొనుగోలు కేంద్రాలను మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి సోమవారం తెలిపారు. రైతులు తొందరపడి మద్దతు ధర కంటే తక్కువ ధరలకు మీ పంట దిగుబడులను అమ్ముకోవద్దని, నష్టాన్ని తెచ్చుకోవద్దని మార్క్ఫెడ్ చైర్మన్ రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు బహిరంగ కొనుగోలు జరిపి దళారులను నమ్మి తక్కువ ధరలకు పంటలను అమ్ముకొని నష్టపోవద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మార్క్ఫెడ్ ద్వారా రైతుల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.


Similar News