భువనేశ్వరి అమ్మవారికి వెండి శఠగోపం బహుకరణ..

దక్షిణ కాశీగా భాసిల్లుతున్న భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయంలోని మాత భువనేశ్వరి అమ్మవారికి సోమవారం వెండి శఠగోపాన్ని బహుకరించారు.

Update: 2024-09-16 12:54 GMT

దిశ, భిక్కనూరు : దక్షిణ కాశీగా భాసిల్లుతున్న భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయంలోని మాత భువనేశ్వరి అమ్మవారికి సోమవారం వెండి శఠగోపాన్ని బహుకరించారు. దోమకొండ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన గాంధారి వెంకటేష్ - వరలక్ష్మి దంపతులు ప్రస్తుతం సికింద్రాబాద్ లో నివసిస్తున్నారు. తండ్రి సిద్దయ్య జ్ఞాపకార్థం ఈ శఠగోపాన్ని అమ్మవారి ఆలయానికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి - శ్యామల దంపతులతో పాటు, ఆలయ ఈఓ పద్మ శ్రీధర్, అర్చకులు కొడకండ్ల రాజేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.


Similar News