ప్రజల సమస్యలు తీర్చడానికే ఫిర్యాదుల పెట్టె

కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తున్న ఫిర్యాదు పెట్టెలని ఆదివారం అన్ని మండలాల్లో ఒక్కో చోట కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రారంభించారు.

Update: 2024-02-11 12:36 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తున్న ఫిర్యాదు పెట్టెలని ఆదివారం అన్ని మండలాల్లో ఒక్కో చోట కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల సమస్యలు తీర్చటం కోసమే ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశామని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఏ సమస్య ఉన్నా కాగితం పై రాసి పెట్టెలో వేస్తే వారంలోగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, తాను అందుబాటులో ఉన్నా లేకున్నా ప్రజలకు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతోనే ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 


Similar News