బస్ లో బంగారం చోరీ

బోధన్ నుండి నిజామాబాద్ కు ప్రయాణిస్తున్న మహిళ మేడలో నుండి 23 గ్రాముల బంగారు ఆభరణాన్నిదొంగలు చోరీ చేశారు.

Update: 2024-02-01 10:19 GMT

దిశ, బోధన్ : బోధన్ నుండి నిజామాబాద్ కు ప్రయాణిస్తున్న మహిళ మేడలో నుండి 23 గ్రాముల బంగారు ఆభరణాన్నిదొంగలు చోరీ చేశారు. బాధితురాలి కథనం ప్రకారం డిచ్ పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పోసాని బుధవారం రుద్రూర్ లోని తమ బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చి గురువారం తిరుగు ప్రయాణం లో బోధన్ లో

    జహీరాబాద్ నుండి నిజామాబాద్ కు వెళ్తున్న బస్ లో ఎక్కింది. తరువాత టికెట్ కొరకు ఆధార్ కార్డ్ తీస్తుండగా బంగారు గొలుసు లేదని గ్రహించింది. తోటి ప్రయాణికులకు చెప్పగా ఎడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బస్ ను ఆపి ఫిర్యాదు చేసింది. బస్ లోని ప్రయాణికులను పోలీసు సిబ్బంది తనిఖీ చేసినా నగ దొరకలేదు. దాంతో పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News