దైవ దర్శనానికి వెళ్లి... అనంతలోకానికి

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో గల తెలంగాణ తిరుమల దేవాలయంగా పిలిచే బీర్కూర్ మండలం వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్లిన మీర్జాపూర్ గ్రామానికి చెందిన సబ్బిడి హన్మాండ్లు అనే ప్రభుత్వ ఉపాద్యాయుడు ఆటో బోల్తా పడి శనివారం మృతి చెందాడు.

Update: 2024-02-03 11:33 GMT

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో గల తెలంగాణ తిరుమల దేవాలయంగా పిలిచే బీర్కూర్ మండలం వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్లిన మీర్జాపూర్ గ్రామానికి చెందిన సబ్బిడి హన్మాండ్లు అనే ప్రభుత్వ ఉపాద్యాయుడు ఆటో బోల్తా పడి శనివారం మృతి చెందాడు. కూతురు పుట్టిన రోజు సందర్భంగా దేవస్థానం దర్శనం చేసుకొని ఆటోలో తిరుగు ప్రయాణంలో ఆటో బ్రేకులు ఫెయిల్ కావడంతో అది పల్టీ కొట్టడంతో కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలు కాగా ఉపాధ్యాయుడికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.  


Similar News