బాల్కొండ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి: ముత్యాల సునీల్

ఆదరించి ఆశీర్వదించి బాల్కొండ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.

Update: 2023-11-28 13:36 GMT

దిశ, ఆర్మూర్ : ఆదరించి ఆశీర్వదించి బాల్కొండ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గం లోని భీంగల్ మండలం బడా భీంగల్, వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ప్రజలను నిలువు దోపిడీ చేశారని ఒకే కాంట్రాక్టర్‌ను పెట్టుకొని కోట్ల రూపాయల దోపిడీ చేశారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కి ఒక అవకాశం ఇవ్వాలని తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి ప్రతి సంవత్సరానికి 15000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు.

భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 సాయం అందిస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళా ఖాతాలో ప్రతి నెల 2500 రూపాయలు జమ చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో అహంకారాన్ని అంతమొందించి ప్రేమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని కోరారు. ఏరుగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు క్యాతం మధు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News