నాలుగు పల్టీలు కొట్టిన కారు...ప్రాణాలతో బయటపడిన దంపతులు

వారు ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్​ వేగంగా వచ్చి ఢీకొట్టింది...

Update: 2024-02-08 13:30 GMT

దిశ, ఎల్లారెడ్డి : వారు ప్రయాణిస్తున్న కారును ఓ కంటైనర్​ వేగంగా వచ్చి ఢీకొట్టింది...దాంతో ఆ కారు నాలుగు పల్టీలు కొట్టింది....అయినా వారు ప్రాణాలతో బయటపడ్డారు...వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ పప్పు వెంకటి దంపతులు బుధవారం కామారెడ్డి నుండి నిజామాబాద్ వెళ్తుండగా ఇందల్వాయి చెక్​పోస్టు దాటిన మూడు కిలోమీటర్ల దూరంలో

    అటవీ ప్రాంతంలో ముందుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేసింది. దాంతో వెనుక వైపు నుండి అతివేగంగా వచ్చిన కంటైనర్ వెంకట్ కారును ఢీకొట్టడంతో కారు రోడ్డుపై నాలుగు పల్టీలు కొట్టింది. దాంతో వెంకట్ దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రజలు చూసి క్షతగాత్రులను 108 అంబులెన్స్​లో నిజాంబాద్ కు తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించినట్లు వెంకన్న కుటుంబ సభ్యులు తెలిపారు. 


Similar News