బీజేపీలో చేరిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే

జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎన్.ఆంజనేయులు (ఎల్లారెడ్డి ), మాజీ ఎమ్మెల్యే పండారి (జుక్కల్ ) తో పాటు నాగల్ గిద్ద జెడ్పీటీసీ రాజు రాథోడ్, గాంధారి మాజీ జెడ్పీటీసీ తానాజీ రావు పాటిల్ తో పాటు 40 మంది సర్పంచ్ లు, ఎంపీటీసీ లు బీజేపీ లో చేరారు.

Update: 2024-04-09 13:01 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎన్.ఆంజనేయులు (ఎల్లారెడ్డి ), మాజీ ఎమ్మెల్యే పండారి (జుక్కల్ ) తో పాటు నాగల్ గిద్ద జెడ్పీటీసీ రాజు రాథోడ్, గాంధారి మాజీ జెడ్పీటీసీ తానాజీ రావు పాటిల్ తో పాటు 40 మంది సర్పంచ్ లు, ఎంపీటీసీ లు బీజేపీ లో చేరారు. మంగళవారం హైదరాబాద్ లోని

    బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో చేరారు. వారికి కిషన్ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు లక్ష్మణ్, రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మా రెడ్డి, మురళీధర్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గం నాయకులు, జుక్కల్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 


Similar News